1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. KCR's convoy meets with accident

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

kcrcm
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తోన్న కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. ఈ సమయంలో వేములపల్లి వద్ద ప్రమాదం జరిగింది.
 
నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురికావడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు షాక్ అయ్యారు. వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఓ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. దాదాపు అన్ని కార్ల బ్యానెట్లు దెబ్బతిన్నాయని వారు తెలిపారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు