మంగళవారం, 22 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (20:24 IST)

లడ్డూపై పవన్ వ్యాఖ్యలు.. కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ

pawan kalyan
తిరుపతి లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయనకు సమన్లు ​​జారీ చేసింది. 
 
జనవరిలో అయోధ్యకు పంపిన తిరుపతి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం తలెత్తింది. తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసి ఉన్నట్లు.. గత ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఆ కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా టీటీడీ పంపించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
 
పవన్ వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, దీంతో న్యాయవాది ఇమ్మనేని రామారావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెల్‌ల నుండి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తొలగించడానికి సంబంధిత ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ వై. రేణుక అధ్యక్షతన ఉన్న సిటీ సివిల్ కోర్టు కూడా అభ్యర్థించింది.