గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (08:47 IST)

44 ఏళ్ల మహిళను హత్య చేసిన ఆటో డ్రైవర్.. కారణం ఏంటంటే?

crime
44 ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి షేక్ జావీద్ ఖాన్, అలియాస్ అమీర్ అలీ (34) అని తేలింది. ఇతడు ఆటో రిక్షా డ్రైవర్. విద్యానగర్‌లోని ఉషా కిరణ్ ఆర్కేడ్స్ అపార్ట్‌మెంట్‌లో వుంటున్నాడు. 
 
యూసుఫ్‌గూడలోని నవోదయ కాలనీకి చెందిన సుధారాణిని జావీద్ హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 8న చెంగిచెర్ల క్రాంతి నగర్ కాలనీ సమీపంలో నిందితుడు షేక్ జావీద్‌ను పట్టుకున్నారు. విచారణ సమయంలో, జావీద్ నేరాన్ని అంగీకరించాడు. 
 
ఆర్థిక లాభం, ప్రతీకారం, వ్యక్తిగత పగతోనే ఈ హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడు. రక్తంతో తడిసిన కత్తి, చోరీకి గురైన నగలు, పత్రాలు సహా కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని ద్విచక్ర వాహనం, కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.