1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. PM Modi to visit Vemulawada on May 8

మే 8న వేములవాడలో ప్రధాన మంత్రి పర్యటన

narendra modi
మే 8న కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని తొలి వేములవాడ పర్యటన దృష్ట్యా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయంలో ఆయన దర్శనం, ప్రత్యేక పూజలు చేసేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. 
 
ఉదయం 10 గంటలకు వేములవాడలో భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించేందుకు షెడ్యూల్ సిద్ధమవుతోంది. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్‌ను రెండు లేదా మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
గోవాలో మే 3న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన