హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఫంక్షనల్ వర్టికల్ సిస్టం అమలు ద్వారా పోలీసుల పనితీరు మెరుగుపరిచినట్లు ఆయన వివరించారు. ప్రజలకు మరింత సులువుగా అందుబాటులో ఉండేలా సామాజిక మాధ్యమాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు. ‘నేరం చేస్తే దొరికిపోరతామనే భయం నేరస్థుల్లో కలిగించాం. స్మార్ట్ పోలీసింగ్ ద్వారా సేవలు మరింతగా అందుబాటులోకి తెచ్చాం. నేర రహిత, మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యాల...