శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 28 జులై 2021 (03:30 IST)

షర్మిళకు పూర్తి మ‌ద్ద‌తు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

నల్గొండజిల్లాలోని చండూరు ‌మండలంలోని పుల్లెంలలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిళ నిరాహార నిరుద్యోగ దీక్ష చేపట్టారు. షర్మిళకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంఘీబావం ప్రకటించారు.

ఢిల్లీ నుంచి ఆయన ఫోన్లో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి  మాట్లాడుతూ... నిరుద్యోగ సమస్యలపై పోరాడే వారికి తమ మద్దతు ఉంటుందన్నారు.

కేసీఆర్ ఉద్యమ‌కారుల‌ను మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ పోరాటంలో షర్మిళ స‌ఫ‌లీకృతం కావాలన్నారు. రాజ‌న్న బిడ్డ‌గా షర్మిళ అడుగుపెట్ట‌డం సంతోషంగా ఉందన్నారు.

షర్మిళకు తన పూర్తి మ‌ద్ద‌తు ఉంటుందని ప్రకటించారు. ఉద్యోగాలను నింపడం వ‌దిలేసి కుటుంబం కోసం కేసీఆర్ ఆలోచిస్తున్నాడని ఎమ్మెల్యే కోమటిరెడ్డి  విమర్శించారు.