గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు విద్యార్థులు మృతి

Written By సెల్వి
Updated: గురువారం, 12 ఆగస్టు 2021 (17:32 IST)
గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సీబీఐటీ కాలేజీ రోడ్డులో కరెంట్ పోల్‌ను కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. ఏపీ09 సీజే 2095 స్విఫ్ట్ డిజైర్ కారు విద్యుత్ పోల్‌ను అతివేగంగా వచ్చి ఢీకొట్టగా.. ఆ సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయి.
 
అయినా, కూడా ప్రాణనష్టం సంభవించింది. అంతేకాకుండా, కారులో వెడ్డింగ్ కార్డులు లభ్యమైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments