1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 డిశెంబరు 2020 (09:43 IST)

గచ్చిబౌలి ఐటీ సెక్టార్‌లో చిరుత కలకలం.. కుక్కను ఎత్తుకెళ్లిందట...

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఐటీ సెక్టార్ ప్రాంతంలో ఓ చిరుతపులి కలకలం రేపింది. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించారు. దీంతో స్థానికులందరూ భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా ఆదివారం ఉదయం రోడా మిస్త్రీ కాలేజీలోని పెంపుడు కుక్కను చిరుత ఎత్తుకెళ్లినట్లు సమాచారం. విషయం తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అటవీశాఖ అలెర్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చిరుత కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు
 
మరోవైపు, కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలం తిక్కపల్లి - భీమారం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రోడ్డుపై వెళుతున్న పులిని సమీప గ్రామస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు. అయితే పులి సంచరిస్తున్న విషయం తెలుసుకుని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.