సంబంధిత వార్తలు
- ఆస్ట్రల్ పైప్స్ బ్రాండ్ అంబాసిడర్గా అల్లు అర్జున్
- శ్రీరెడ్డి భీమవరం కుండ బిర్యానీ, బాగానే గిడుతున్నట్టుంది
- యాక్టింగ్ స్కూల్ నెలకొల్పనున్న రామోజీరావు
- హైదరాబాద్లోని కొండాపూర్లో నూతన క్లాస్రూమ్ కేంద్రం ప్రారంభించిన ఆకాష్-బైజూస్
- హైదరాబాద్లోని వినియోగదారుల కోసం సరికొత్త వర్టుస్ను ప్రదర్శించిన వోక్స్వేగన్ ఇండియా
అసలే ఆకలి.. ఆర్డర్ ఇచ్చిన బిర్యానీలో బల్లి.. ఎక్కడ?
అసలే ఆకలి.. ఆర్డర్ ఇచ్చిన బిర్యానీలో బల్లి వుండటం చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు. అంతే తిన్నదంతా వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉండే ఒక ప్రముఖ రెస్టారెంట్లో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే...రాంనగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాడు.
సగం బిర్యానీ తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్ అయ్యాడు. దీంతో కంగుతిన్న కార్పొరేటర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు బిర్యానీని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్కు పంపించారు. అదే విధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
