సంబంధిత వార్తలు
- సహజీవనం చేసి దూరం పెడుతున్నాడని ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి!
- ఓ భర్త... ఇద్దరు భార్యలు... లైవ్ స్ట్రీమ్ శృంగార బాగోతం.. ఎక్కడ?
- ప్రియుడి కోసం కన్నబిడ్డల్ని.. మేకులు వున్న కర్రతో కొట్టి..?
- డాక్టర్ భార్య కాపురానికి రాలేదనీ.. సైకో డాక్టర్ ఏం చేశాడంటే..
- ప్రతిఘటించిందనీ పదో అంతస్తు నుంచి తోసేశారు.. ఎక్కడ?
కన్నబిడ్డను పోషించలేక అమ్ముకున్న తల్లిదండ్రులు
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నబిడ్డను పోషించలేక అమ్ముకున్న తల్లిదండ్రుల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఐదు నెలల తర్వాత తమ బిడ్డను తమకు ఇప్పించాలంటూ తల్లి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. మీనా, వెంకటేష్ దంపతులకు జులై 19న బిడ్డ పుట్టగానే ఓ మధ్యవర్తి ద్వారా వేరొకరికి అమ్మేసారు.
కప్రా సర్కిల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న రాజేష్.. మీనాను తన భార్య అని చెప్పి ఈఎస్ఐ ఆస్పత్రిలో డెలివరీ చేయించాడు. అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకువెళ్లాడు. ఈఎస్ఐ ఆస్పత్రి సాక్షిగా బిడ్డ అమ్మకం గుట్టుగా సాగిపోయింది. అయితే తనకు పుట్టింది ఆడపిల్ల అని చెప్పి మోసం చేశారంటూ బాధితురాలు ఐదు నెలల తర్వాత పోలీసులను ఆశ్రయించింది.
తనకు మగబిడ్డ పుడితే ఆ విషయం దాచిపెట్టి మధ్యవర్తి అమ్మేశాడని చెప్పింది. ఇప్పుడు తన కొడుకు కావాలని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించి.. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.