1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (12:42 IST)

పబ్‌లో పట్టుబడిన నిహారిక కొణిదెల - జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్

హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటళ్ళల్ రాడిసన్ బ్లూ ప్లాజాలో పుడ్డింగ్, మింక్ పబ్‌లపై ఆదివారం తెల్లవారుజామున జూబ్లీ హిల్స్ పోలీసులు ఆక్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో తెలుగు బిగ్ బాస్ టైటిల్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు.. మెగా డాటర్ నిహారిక కొణిదెలతో పాటు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్ నిబంధనలను ఉల్లంఘించి, మూసివేసిన గంటల తర్వాత పబ్ నడపడంతో పోలీసులు పబ్‌పై దాడులు నిర్వహించాయి. ఆ సమయంలో పబ్‌లో ఉన్నవారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి నుంచి వివరాలు సేకరించి వదిలివేశారు. స్టేషన్‌కు తరలించిన వారిలో సినీ సెలెబ్రిటీల పిల్లలు కూడా ఉండటంతో ఈ వ్యవహరంపై పోలీసు పెద్దలపై ఒత్తిడి పెరిగింది. దీంతో పబ్‌పై దాడి చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు చేపట్టారు. 
 
ఈ పబ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వ్యవహారంలో జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రును పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే, ఏసీపీకి చార్జిమెమో జారీ చేశారు. ఈ పబ్‌పై దాడి వ్యవహారం ఇపుడు హైదరాబాద్ నగరంలో చర్చనీయాంశంగా మారింది.