సంబంధిత వార్తలు
- ఢిల్లీలోని అసెంబ్లీలో ఓ సొరంగ మార్గం.. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు..?
- గినియాలో మరో భయంకరమైన వైరస్ను గుర్తించిన శాస్త్రవేత్తలు
- మార్మోగిపోతున్న కాళేశ్వరం ప్రాజెక్టు... డిస్కవరీ చానెల్లో
- అద్దె కట్టలేదు.. ఇంటి పైకప్పు పెచ్చులూడిపోయి 4 పాములు వేలాడుతుంటే..?
- గర్భంతో వున్న ఈజిప్టు మమ్మీని గుర్తించిన పరిశోధకులు.. గర్భంలోని పిండానికి..?
తెలంగాణలో అరుదైన మూషిక శిల్పం.. గణపతి దేవుడి కాలానికి..?
తెలంగాణలో అరుదైన మూషిక శిల్పం బయటపడింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం జనగాంలోని శిథిలంగా మారిన శివాలయం వద్ద ఈ విగ్రహం బయల్పడింది. ఈ శివాలయం 800 ఏళ్ల నాటిది.
ఈ విగ్రహానికి సంబంధించి పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ, కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో తుప్పలు, పొదలు తొలగిస్తుండగా గణపతి వాహనం వెలుగుచూసిందని చెప్పారు.
ఈ శిల్పం 3 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తు ఉందని శివనాగిరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇదే అతిపెద్ద మూషిక విగ్రహమని చెప్పారు. సర్వాభరణాలతో అలంకరించినట్టున్న ఈ శిల్పం గణపతిదేవుడి కాలానికి చెందినదని తెలిపారు.
త్రికూటాలయంలో రెండు ఆలయాల్లో శివలింగాలు ఉన్నాయని. మూడో ఆలయం వినాయకుడిది అయిఉండొచ్చని చెప్పారు. గుప్తనిధుల కోసం ఈ విగ్రహాన్ని పెకిలించి ఉండొచ్చని తెలిపారు.