1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (14:38 IST)

రేవంత్ రెడ్డి అసహనం.. హెడ్‌ఫోన్ విసిరేసి.. పోడియం వైపు దూసుకెళ్లారు!

తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ యువనేత రేవంత్ రెడ్డి గురువారం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర అసహనానికి గురయ్యారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలంటూ రేవంత్ రెడ్డి పదేపదే చేసిన విజ్ఞప్తిని సభాపతి మధుసూదనాచారి ఏమాత్రం పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. 
 
తీవ్ర అసహనానికి గురైన రేవంత్ రెడ్డి.. ఆగ్రహంతో ఊగిపోతూ, హెడ్ ఫోన్‌ను విసిరేసి పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆ వెంటనే లంచ్ బ్రేక్ కోసమంటూ సభను అరగంట పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి అన్నం తిని రావడానికి మిగతా మిత్రులతో కలసి వెళ్ళారు.