సంబంధిత వార్తలు
- అనిల్ సుంకర, శ్రీ విష్ణు కాంబినేషన్లో నూతన చిత్రం
- పీఛేమూడ్ : మారిన యార్లగడ్డ స్వరం.. పేరు మార్పుపై నో కామెంట్స్
- ఉప్పల్ టీ20 : భారత్ టార్గెట్ 187 రన్.. తొలి ఎదురుదెబ్బ
- వికృత రాజకీయాల కోసం ఎన్టీఆర్ మనసును క్షోభ పెట్టొద్దు : జీవీఎల్
- చిరంజీవి, నాగార్జున సినిమాలతో పాటు స్వాతి ముత్యం విడుదల కావడం ఆనందంగా ఉంది - చదర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ
400 రూపాయలకే కిలో మటన్- షాపుల వద్ద భారీ బందోబస్తు
సిద్ధిపేట జిల్లాలో మటన్ షాపుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే.. మిరుదొడ్డి మండలం అక్బర్పేటలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 రూపాయలకే కిలో మటన్ విక్రయించారు. దీంతో మాంసం ప్రియులు పెద్దఎత్తున ఎగబడ్డారు.
ఆదివారంతో పాటు పెద్దల అమావాస్య కావడంతో వివిధ మండలాల నుంచి భారీగా మాంసం ప్రియలు తరలివచ్చారు. మటన్ తీసుకోవాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
ఒకానొక సమయంలో మటన్ షాపుల వద్ద తోపులాట చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మాంసం దుకాణాల వద్ద ఎటువంటి ప్రమాదం జరగకుండా బందోబస్తు నిర్వహించారు.