1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

డబ్బు - నగలుతో ప్రియుడితో పారిపోయేందుకు అక్కను చంపేసిన చెల్లి... వోడ్కా తాగి...

deepti
తెలంగాణ రాష్ట్రంలోని కోరుట్లలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. సొంత అక్కను చెల్లి చందన చంపేసింది. ఇంట్లో ఉన్న డబ్బు, నగలను తీసుకుని తన ప్రియుడితో వెళ్లిపోయేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పింది. ఈ కేసులో చందన, ఆమె ప్రియుడుతో సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ వెల్లడిస్తూ, ప్రధాన నిందితురాలు చందన గత 2019లో హైదరాబాద్ నగరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్‌లో చేరింది. రెండేళ్ళ తర్వాత డిటెయిన్ అయింది. అదే కాలేజీలో చదివిన ఉమర్ షేక్ సుల్తాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారి తీసింది. 
 
ఆగస్టు 19వ తేదీన వీరు కోరుట్లకు వచ్చి పెళ్లి విషయమై మాట్లాడారు. అయితే ఇద్దరం ఇంకా సెటిల్ కాలేదని, కాబట్టి డబ్బులు కావాలని ఉమర్ అడిగాడు. ఆ తర్వాత ఓ సమయంలో ఉమర్‌కు చందన ఫోన్ చేసి ఇంట్లో మా అక్క తప్ప ఎవరూ లేరని, కోరుట్లకు రావాలని చెప్పింది. దీంతో ఉమర్ అగస్టు 28వ తేదీన కోరుట్లకు వచ్చాడు.
 
ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం దీప్తి కోసం చందన వోడ్కా, బ్రీజర్ తెచ్చింది. సోమవారం రాత్రి తండ్రి శ్రీనివాస్ రెడ్డితో ఫోనులో అక్కాచెల్లెలు మాట్లాడారు. ఆ తర్వాత అక్కతో కలిసి వోడ్కా తాగి పడుకుంది. దీప్తి నిద్రపోయిన తర్వాత చందన... ఉమర్‌కు ఫోన్ చేసి, ఇంటికి రప్పించింది. 
 
ఇద్దరు కలిసి ఇంటిలోని బీరువాలో ఉన్న నగదు, బంగారం తీస్తుండగా... అది చూసిన దీప్తి కేకలు వేసింది. దీంతో దీప్తి అరవకుండా మెడకు చున్నీ చుట్టి వెనక్కి లాగారు. అయినా అరవడంతో ఇద్దరూ కలిసి దీప్తి ముఖానికి చున్నీని చుట్టి, మూతికి, ముక్కుకు ప్లాస్టర్ వేశారు. కొద్ది నిమిషాల తర్వాత ఆమెలో చలనం లేకపోయేసరికి ఆమెను అక్కడే వదిలేసి 70 తులాల బంగారం, రూ.1.20 లక్షల నగదును తీసుకొని అక్కడ నుంచి పారిపోయారని పోలీసులు వివరించారు. 
 
దీప్తిని చంపేసిన తర్వాత వోడ్కా తాగి చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశారన్నారు. ఆర్మూర్ బాల్కొండ రోడ్డులో నిందితులు కారులో వెళ్తున్నారనే సమాచారంతో కోరుట్ల సీఐ ప్రవీణ్ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకోగా, వారివద్ద జరిపిన విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. దీంతో చందనతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ ఉమర్ షేక్ సుల్తాన్‌, అతని తల్లి సయ్యద్ అలియా, షేక్ ఆసియా ఫాతిమా, హఫీజన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుండి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.