1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (09:29 IST)

బండి సంజయ్‌కు వడదెబ్బ - అస్వస్థత

bandi sanjay
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధినేత బండి సంజయ్ ఆదివారం నారాయణపేట మండలంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా వడదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యారు. దీనిపై బండి సంజయ్‌ వ్యక్తిగత వైద్యుడు మీడియాతో మాట్లాడుతూ.. అస్వస్థతతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అతను వడదెబ్బ, డీహైడ్రేషన్ మరియు అసిడిటీ సమస్యలతో బాధపడ్డాడు.
 
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు డాక్టర్ తెలిపారు. బీజేపీ నేత మాదిరెడ్డి జలంధర్ రెడ్డి నివాసంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత బండి సంజయ్ యాత్రను పునఃప్రారంభించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతుందని బీజేపీ నేత బండి సంజయ్ ప్రకటించారు.