1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (22:17 IST)

అక్భరుద్ధీన్‌ను వదిలేది లేదు.. కేసీఆర్‌ భయం లేదు..? బండి సంజయ్

bandi sanjay
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. 
 
అలంపూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు. హిందువుని అని చెప్పుకునే కేసీఆర్‌కి అమ్మవారంటే భయం లేదని.. మజ్లిస్ పార్టీ అంటే భయమని ఎద్దేవా చేశారు.
 
అధికారంలోకి రాగానే పాత కేసులన్నీ తిరగతోడి కేసీఆర్ సంగతి చూస్తానంటూ శపథం చేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు నుంచి బయటపడిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను వదిలేది లేదన్నారు. హిందువులను నరికి చంపుతానన్న అక్బర్‌ను వదిలే ప్రసక్తే లేదన్నారు.