గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (23:19 IST)

ఎంపీ అరవింద్‌కి పిచ్చి కుక్క కరిచి.. పిచ్చి పట్టింది.. ఎమ్మెల్యే షకీల్

Shakeel Ahmad
నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కి పిచ్చి కుక్క కరిచి... పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోధన్‌లో రోహింగ్యాలు లేరు.. ఉన్నారని నిరూపిస్తే నిమిషంలో రాజీనామ చేస్తానని సవాల్‌ విసిరారు. ఇతర దేశాస్థులు భారత దేశంలోకి ప్రవేశిస్తున్నారంటే ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఫైర్‌ అయ్యారు. దేశంలో బిజెపి ప్రభుత్వ నిఘా వ్యవస్థ, భద్రత వ్యవస్థ విఫలమైందని.. అందుకే ఇతర దేశాస్థులు అక్రమంగా చొరబడి శాంతి భద్రతలకు విఘతం కల్గిస్తున్నారని మండిపడ్డారు. 
 
32మంది నకిలీ పాస్ పోర్టులు పొందారు అంటే రీజినల్ పాస్ పోర్ట్ అధికారి ఏమి పీకుతున్నాడని.. ఆ అధికారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నకిలీ పాస్ పోర్టులు మంజూరు చేసింది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి పాస్‌పోర్టులకి సంబంధం ఏంటి..? పాస్ పోర్ట్ మంజూరు చేసిన రీజినల్ పాస్‌పోర్టు అధికారిని సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.