1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (10:35 IST)

విదేశీ విద్యార్థులకు శుభవార్త: ఆ స్కీమ్ గడువు పెంపు

విదేశీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కారు. తెలంగాణ సర్కారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం సహాయం చేస్తోంది.

అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ చేయాలనుకుంటున్న విద్యార్థులు ఈ పధకానికి అప్లై చేసుకోవచ్చు.  
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి విధించిన గడువును పెంచారు. ఇక ఈ పధకం కింద 20 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ సభ్యుల సంవత్సర ఆదారం రూ. 5 లక్షల లోపు ఉండాలి. అలాగే వయస్సు జూలై 1 నాటికి 35 ఏళ్లు లోపు వారు అయి ఉండాలి.