1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. tungabhadra express to run from April 1st

ఏప్రిల్ ఒకటి నుంచి తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ పరుగులు

Tungabhadra Express
సికింద్రాబాద్ ‌- కాచిగూడ - కర్నూలు సిటీ తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో రద్దు చేసిన ఈ రైలు కోసం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు.
 
మహబూబ్‌నగర్‌లో పనిచేసే ఉద్యోగులు ఈ రైలులో వెళ్లి తిరిగి నగరానికి వస్తుంటారు. ఇది సికింద్రాబాద్‌లో ఉదయం 7.40 గంటలకు బయలుదేరి 7.50 గంటలకు కాచిగూడకు వస్తుంది. మలక్‌పేట, ఫలక్‌నుమా, ఉందానగర్‌ (శంషాబాద్‌), షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌కు (9.55 గంటలు), గద్వాల మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు నగరానికి చేరుకుంటుంది. 
 
తిరిగి ఈ రైలు కర్నూలులో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్‌ (5.15 గంటలు) తదితర స్టేషన్ల మీదుగా రాత్రి 7.18 గంటలకు కాచిగూడకు, 7.55 గంటలకు తిరిగి సికింద్రాబాద్‌కు వస్తుంది. 
About Writer
ఎం
తర్వాతి కథనం
సర్వాంతర్యామి పరమశివుడు : చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి