సంబంధిత వార్తలు
- ఏపీలో స్వైన్ఫ్లూ... 27 కేసులు నమోదు... జికా వైరెస్ జాగ్రత్త
- జస్టిస్ ఫర్ ప్రణయ్-అమృతవర్షిణిని అలా కామెంట్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు..
- ప్రణయ్ని ప్రాణాలతో తీసుకొస్తేనే నా తండ్రిని క్షమిస్తా: అమృత వర్షిణి
- అమృతలాంటి ఆడపిల్లా వద్దూ.. మారుతి రావులాంటి తండ్రినీ ఇవ్వకు సామి...
- ప్రణయ్పై అలాంటి ప్రచారం తగదు..ఇక ఆపండి-అమృత
ప్రణయ్ హత్య కేసు.. ఆ ముగ్గురిపై మరో రెండు కేసులు
మిర్యాలగూడ ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పరువు కోసం ప్రణయ్ని హత్య చేయించిన అమృతవర్షిణి తండ్రి ప్రస్తుతం జైలులో వున్నాడు. ప్రణయ్ హత్య కేసు కారణంగా జైలులో ఉన్న అమృత తండ్రి మారుతీరావు, శ్రవణ్, కరీంలపై మరో రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టును హాజరు పరిచారు.
ఈ కేసుల వివరాలకు వస్తే.. ప్రణయ్ బంధువులైన కోడిరెక్క అశోక్ను ఆగస్ట్ 6వ తేది, ఎర్రమళ్ల దినేష్ను ఆగస్ట్ 11వ తేది వారి కార్యాలయానికి పిలిపించి ప్రణయ్ కదలికలు మాకు తెలియజేయాలని, వారి సంబంధాలు వదిలేసుకోవాలని అమృత తండ్రి మారుతీరావు, శ్రవణ్, కరీంలు బెదిరించారు.
ఈ విషయంపై ప్రణయ్ బంధువులు తిరస్కరించడంతో వారిని హతమార్చుతామని బెదిరించారు. దాంతో అశోక్, ఎర్రమళ్ల దినేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ముగ్గురి నిందితులను కోర్టులోనికి ప్రవేశపెట్టారు. కేసును విచారించిన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నిందితులను అక్టోబర్ 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.