1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (07:50 IST)

అన్ని ‌వర్గాల‌ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి హరీశ్ రావు

అన్ని వర్గాల ప్రజల‌ సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ దిశ గా‌ సీఎం కేసీఆర్  చర్యలు తీసుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు.

ఇవాళ బీఆర్కే భవన్ లో తనను కలిసిన  జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్టు లెక్చర్ల జేఎసీ నేతలకు బేసిక్ పే అమలు‌  కు సంబంధించిన 104, 105, 106 జీవోలను మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలను మంత్రులు అభినందించారు.

బేసిక్ పే జీవో విడుదల‌ చేసినందుకు వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు 

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ ఛైర్మన్ కనక చంద్రం , సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్ మరియు రాష్ట్ర మహిళా సెక్రెటరీ మాలతి, డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల అధ్యక్షులు వినోద్ కుమార్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యక్షులు ఉమ శంకర్ , రాష్ట్ర నాయకులు సదానందం మరియు త్రి భువనేశ్వర్ లో తదితరులు పాల్గొన్నారు