Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?
బొమ్మరిలు, ఆరెంజ్ సినిమాల దర్శకుడు భాస్కర్ కొంత గేప్ తీసుకుని జాక్ సినిమా తీశాడు. సిద్దు జొన్నలగడ్డతో రూపొందించిన ఈ సినిమా పూర్తిఎంటర్ టైన్ మెంట్ గా వుంటుందని రిలీజ్ కు ముందు భారీ ప్రమోషన్ చేశారు. అసలు పాయింట్ అనేది దాచేసి వినోదం అంటూ చెప్పారు. అయితే విడుదల తర్వాత ఈ సినిమా సీరియస్ పాయింట్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. కానీ దాన్ని వినోదం చూస్తారనున్న దర్శకుడి అంచనా తారుమారుఅయింది.
సినిమా మంచి హైప్ తో విడుదలైనా దురదృష్టవశాత్తు, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరియు అమెరికాలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మొదటి మరియు రెండవ రోజుల కలెక్షన్లు రికార్డు స్థాయిలో తగ్గాయి, సిద్ధు తన ప్రజాదరణ పొందినప్పటికీ థియేటర్లకు ఎలాంటి ప్రేక్షకులను రప్పించుకోలేకపోవడాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.
ఇదంతా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ వల్ల జరిగింది. ఆయన కథ, కథనాన్ని సీరియస్గా తీసుకోలేదు. అసలు టెర్రరిజం పాయింట్ ను ఎంచుకోవడమే పెద్ద తప్పిదంగా అనిపిస్తుంది. ఈ పాయింట్ ను సిల్లీగా చూపించడం ప్రేక్షకులకు మింగుపడలేదు. కథనం నిరాశపరిచే విధంగా రూపొందించారు. సోషల్ మీడియాలో దర్శకుడి పై భారీ ట్రోల్స్ వస్తున్నాయి.
ఈ సినిమా చూసిన వారందరూ సిద్ధు ఇంత చిన్న సినిమాకి ఎందుకు ఓకే చెప్పాడనే దాని గురించి వ్యాఖ్యానిస్తున్నారు. జాక్ 'రా' ఏజెంట్ల గురించి, వారిని ప్రదర్శించిన విధానం ప్రేక్షకులపై పెద్ద జోక్గా ముగుస్తుందనే రిపోర్ట్ లు వస్తున్నాయి. ట్విస్ట్ ఏమంటే, ఈ సినిమాకు మరో రెండు కథలు సీక్వెల్ తీయాలనుందని భాస్కర్ విడుదలకు ముందు చెప్పడం విశేషం.