శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (13:49 IST)

ముఖేశ్ అంబానీ ఇంట్లో తారల సందడి... ఎందుకో తెలుసా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ ఇంటికి బాలీవుడ్ సెలెబ్రిటీలు క్యూకట్టారు. దీంతో అంబానీ నివాసం తారల తళుకులతో సందడిగా మారింది. సోమవారం గణేష్ చతుర్థిని పురస్కరించుకుని అంబానీ ఇంట్లో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారాగణమంతా హాజరైంది. 
 
ముఖ్యంగా, బాలీవుడ్ అగ్రతారలు అమితాబ్ తన కుటుంబ సభ్యులతో హాజరుకాగా, బాలీవుడ్ యువ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, ఆమీర్‌ఖాన్, అనిల్ కపూర్, కత్రినాకైఫ్, మాధురీ దీక్షిత్, కరిష్మాకపూర్, కరణ్ జోహార్, కాజోల్, విద్యాబాలన్, కృతి సనన్, అదితీ రావు హైదరీ.. హాజరై ప్రతిఒక్కరూ సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపించారు. 
 
వీరితో పాటు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, హర్భజన్, జహీర్‌ఖాన్‌లు తమతమ కుటుంబ సభ్యులతో హాజరుకాగా, హార్ధిక్ పాండ్యా మాత్రం సింగిల్‌గా వచ్చారు. సాధారణంగా అంబానీ ఇంట్లో ఈ వినాయక చవితిని ఎంతో ప్రత్యేకంగా భావించి పూజలు చేస్తుంటారు. 
 
ఈ యేడాదే ఏడాదే ముఖేష్-నీతా అంబానీల గారాలపట్టీ ఈషా, కుమారుడు ఆకాష్ అంబానీ వివాహం కావడం, పైగా ఒకే ఏడాది ఇంట్లో రెండు పెళ్లిల్లు జరగడంతో అంబానీల ఆనందానికి అంతు లేదని చెప్పొచ్చు. ఈ కారణంగా ఈ పూజా కార్యక్రమానికి బాలీవుడ్ సహా ముంబైకి చెందిన ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.