గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పోలీసులను ఆశ్రయించిన సినీ నటి శ్రీసుధ.. చిక్కుల్లో శ్యామ్ కె నాయుడు

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సనిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై సినీ నటి శ్రీసుధ భీమిరెడ్డి పోలీస్ కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్ళపాటు కాపురం చేసి మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇపుడు కేసును ఉపసంహరించుకోవాలంటూ పలువురితో కలిసి బెదిరిస్తున్నారంటూ మరోమారు పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లు కలిసున్న తర్వాత ఇప్పుడు కాదంటున్నాడంటూ గతేడాది శ్రీసుధ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడీ కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారంటూ మరోమారు ఎస్సార్ నగర్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. 
 
సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా మాదాపూర్‌లోని తన నివాసానికి పిలించాడని, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటితో కలిసి కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
చిన్నా తనను దూషించాడని పేర్కొన్న శ్రీసుధ.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. శ్రీసుధ ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేయనున్నట్టు చెప్పారు.