1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (13:04 IST)

రజనీకాంత్‌కు ఘనస్వాగతం పలికిన నందమూరి బాలకృష్ణ

balakrishna
దివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడ చేరుకున్నారు. నటుడికి నందమూరి బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.
 
అనంతరం సాయంత్రం ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రజనీకాంత్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నారు. గతంలో 2004లో కృష్ణా నది పుష్కరాల సందర్భంగా సూపర్ స్టార్ విజయవాడకు రావడం ఇదే తొలిసారి కాదు.
 
ఈరోజు సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.
 
వేడుకల్లో భాగంగా అసెంబ్లీలో ఎన్టీఆర్ ప్రసంగాలు, వివిధ వేదికలపై ప్రజలను చైతన్యపరిచేందుకు చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు.