1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (11:17 IST)

చిరంజీవి-వెంకీల మల్టీ స్టారర్ సినిమా ఖాయం.. అద్భుతంగా వుంటుందట...

venkatesh
ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి మొదటి తరం హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. కానీ, తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితర హీరోలు మల్టీస్టారర్ చిత్రాల వైపు చూడలేదు. 
 
మహేష్ బాబు, రామ్, వరుణ్ తేజ్... తన తర్వాత వచ్చిన హీరోలతో వెంకటేష్ సినిమాలు చేశారు. హరికృష్ణ, మోహన్‌బాబులతో నాగార్జున నటించారు. ఇప్పుడు యువ కథానాయకులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లతో నా సామి రంగ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు టాప్ హీరోలు కలిసి సినిమా చేస్తే? త్వరలోనే ఆ కోరిక నెరవేరే అవకాశాలున్నాయి.
 
వెంకటేష్ (వెంకీ 75 ఈవెంట్)తో మల్టీస్టారర్ సినిమా చేయాలనుకుంటున్నట్లు వెంకీ 75 ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఆయన మాట్లాడుతూ ''వెంకీతో సినిమా చేయాలని ఉంది. మా కాంబోలో ఓ కథ రావాలని కోరుకుంటున్నాను" అన్నారు చిరంజీవి. ఆయన కోరికపై వెంకటేష్ కూడా స్పందించారు. చిరంజీవితో ఓ సినిమా ఉంటుంది. ఆ సినిమా అద్భుతంగా ఉండబోతోంది.. అని వెంకటేష్ తెలిపారు. వెంకటేష్ పరిపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం అని చిరంజీవి పేర్కొన్నారు.  
 
వెంకటేష్ తాజా చిత్రం సైంధవం. హీరోగా ఇది అతనికి 75వ సినిమా. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. కలియుగ పాండవులు పేరుతో సైంధవం పేరుతో 75 చిత్రాల ప్రయాణం బుధవారం రాత్రి జరుపుకుంది. ఆ కార్యక్రమంలో ఈ మల్టీస్టారర్ ప్రస్తావన వచ్చింది.