శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (15:10 IST)

'ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా' అంటున్న మిల్కీ బ్యూటీ

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు". అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ ఉండగా, అందులో తమన్నా నటించింది. ముఖ్యంగా, ఈ స్పెషల్ సాంగ్‌లో తమన్నా... ఆర్మీ ప్యాంట్స్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని ఇరగదీసింది. 
 
'ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా' అనే ఫన్నీ లిరిక్స్‌తో సాగే ఈ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో స్పెష‌ల్ సెట్ వేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. మహేష్ బాబు, త‌మ‌న్నా పోటాపోటీగా స్టెప్స్ వేశారు. 
 
తాజాగా డాంగ్ డాంగ్ సాంగ్‌కి సంబంధించిన మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో సాంగ్‌కి సంబంధించిన విష‌యాల‌ని త‌మ‌న్నా, అనీల్ రావిపూడి పంచుకున్నారు. 'సరిలేరు నీకెవ్వ‌రు' చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించారు. 
 
అనీల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. విజ‌య‌శాంతి దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో వెండితెర‌కి రీ ఎంట్రీ ఇస్తుంది. జ‌న‌వ‌రి 11న చిత్రం విడుద‌ల కానుంది. ఇటీవలే ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక జరిగిన విషయం తెల్సిందే.