శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 ఏప్రియల్ 2025 (12:45 IST)

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Dil Raju
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ముందుగా చెప్పినట్టుగానే బుధవారం కీలక ప్రకటన చేశారు. క్వాంట్ ఏఐ గ్లోబల్‌తో కలిసి ఏఐ స్టూడియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అధునాత ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మే 4వ తేదీన ప్రకటిస్తామని వెల్లించారు. 
 
ఈ విషయాన్ని తెలియజేస్తు దిల్ రాజు కంపెనీ వదిలిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే 'క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌'తో కలిసి.. తన కొత్త ఏఐ స్టూడియోను ప్రారంభించబోతున్నట్లు వీడియో ద్వారా తెలియచేశారు. సినిమా ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన మార్పులను ఈ వీడియోలో చూపించారు. ఇప్పుడు ఏఐ అన్నిరంగాలను శాసిస్తుండటంతో... దిల్ రాజు ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు.
 
సాధారణంగా, దిల్ రాజు ఏడాదికి క‌నీసం ఆరేడు సినిమాలు తీయ‌గ‌ల స‌త్తా ఉన్న నిర్మాత‌. సో త‌న సొంత సినిమాల‌న్నింటిలో ఇప్పుడు ఏఐ  టెక్నాలజీతో ఉపయోగించే ఛాన్స్ కనిపిస్తోంది. డబ్బింగ్ నుంచి విజువల్ ఎఫెక్స్ వరకూ ఎలాంటి వర్క్ నైనా ఏఐతో చేసుకునే అవకాశం ఉంది. అందుకే టాలీవుడ్‌కు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‎గా  ఉన్నారు. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ, పంపిణీ చేస్తు బిజీగా ఉన్న ఆయన కొత్త కంపెనీకి శ్రీకారం చుట్టడం ఆయన ముందు చూపును తెలియచేస్తోంది.