1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (17:33 IST)

దర్శకుడి జర్నీ నేపథ్యంలో- ఘరానా మొగుడు-ప్రారంభం

Mohan Krishna, Varsha, Tummala
మోహన్ కృష్ణ, వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న సినిమా ఘరానా మొగుడు. రాజుబాబు దర్శకత్వంలో యస్.యమ్.కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధ‌వారం హైదరాబాద్ మణికొండ శివాలయంలో పూజ కార్యక్రమాల తో ప్రారంభమైనది. ముఖ్య అతిథులుగా వచ్చిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. సీనియ‌ర్ దర్శకుడు సాగ‌ర్ గౌరవ దర్శకత్వం వహించారు. జెమిని సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏ.ఎస్ రవికుమార్ స్క్రిప్ట్ అందించారు.
 
అనంతరం తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, మోహన్ గారు చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా టైటిల్ తో తను సినిమా తీస్తున్నాడు. ఇప్పుడు తను తీస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని అన్నారు . 
 
సాగర్ మాట్లాడుతూ, వాణి విశ్వనాథ్ నా చిత్రంలో నటించింది. ఇప్పుడుఈ చిత్రంలో ఆమె కూతురు వర్ష‌ విశ్వనాథ్ నటిస్తున్నందంటే ఇది నాకు సొంత బ్యానర్ లాంటిదే. ఈ చిత్రం మోహన్ కు, వ‌ర్ష విశ్వనాథ్ కు మంచి విజయం సాధించి వారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు.
రవికుమార్ చౌదరి మాట్లాడుతూ* ..1992 లో చిరంజీవి గారి ఘరానా మొగుడు చిత్రం గొప్ప సంచలనం సృష్టించింది. ఆ చిత్రం లాగే ఈ మూవీ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుతూ ఈ చిత్ర బృందానికి మంచి పేరు రావాలని  అన్నారు.
 
హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ, నా మొదటి సినిమా రెడ్డి గారి ఇంట్లో రౌడీ ఇజం విడుదలకు సిద్ధంగా ఉంది. నా సెకండ్ మూవీ  మా అమ్మగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ లో నేను నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 
 
నిర్మాత, హీరో, మోహన్ కృష్ణ మాట్లాడుతూ, ఇప్పటివరకు నేను `బావ మరదలు, మోహన్ కృష్ణ `గ్యాంగ్ లీడర్` సినిమాలు తీయడం జరిగింది .ఇది ప్రొడక్షన్ నెంబర్ త్రీ లో చిరంజీవిగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ తో చిత్రం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో నేను సినిమా తీయడానికి ముందుకు వచ్చాను. మంచి సబ్జెక్టు తీసుకొని మంచి కంటెంట్ తో వస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు. 
 
దర్శకుడు రాజుబాబు మాట్లాడుతూ, ఘరానా మొగుడు సినిమా వచ్చినప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ వ్రాస్తున్నాను. సినిమా చూసిన తర్వాత నాకు సినిమాపై మక్కువ ఏర్పడింది. ఆ తరువాత 1999 లో సినిమా ఇండస్ట్రీ కి వచ్చాను 2019 వరకు నేను పలు దర్శకుల దగ్గర పనిచేశాను. గ‌తంలో దర్శకులపై  పూరి గారు నేనింతే తీశాడు. దానికి భిన్నంగా చూపించడం జరిగింది అలాంటి కాన్సెప్ట్ తోనే ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను. ఇది ఒక దర్శకుడి సినిమా ,మాస్ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న సినీ దర్శకుడి కథ. ఒక సినీ దర్శకుడు సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత ఎలాంటి ఆశలతో భావాలతో వస్తాడు ఎలాంటి అంకితభావంతో పని చేస్తాడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని తను ఎలా దర్శకుడిగా నిర్వర్తిస్తాడు. అదే సమయంలో అందమైన మంచి మనసు ఉన్న అమ్మాయి తన జీవితంలో ఎదురైన తరువాత ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే కథతో ఈ సినిమా తీయడం జరిగింది. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అన్నారు