Thaman: అఖండ 2: తాండవం లో పండిట్ శ్రవణ్ మిశ్రా, అతుల్ మిశ్రా బ్రదర్స్ ఎంట్రీ
Thaman with Pandit Shravan Mishra, Atul Mishra Brothers
కంపోజర్ తమన్ తాజాగా అఖండ 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రారంభించారు. పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులు సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యంతో ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు ఈ ప్రతిభావంతులైన సోదరులు అఖండ 2తో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
థమన్ అందిస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వీరు సంస్కృత శ్లోకాలతో మంత్ర ముగ్ధులను చేయబోతున్నారు. ఈ శ్లోకాలు, వేద మంత్రాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెచ్చేలా వుండబోతున్నాయి. థమన్ అందిస్తున్న పవర్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హై వోల్టేజ్ ఎనర్జీ అందించబోతోంది.
ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అఖండ 2: తాండవం గ్రేట్ స్పిరుచువల్, యాక్షన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అఖండ : తాండవం' పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్ భారీ బజ్ క్రియేట్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది.