గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (12:09 IST)

రజినీకాంత్ అల్లుడు పాస్‌పోర్టు మిస్సింగ్...

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో అల్లుడు పాస్‌పోర్టుతో పాటు.. ఇతర క్రెడిట్, డెబిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులను పోగొట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి రజినీకాంత్ చిన్న కుమార్తె సౌంద‌ర్య వివాహం ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన విషయం తెల్సిందే.
 
ప్ర‌ముఖ బిజినెస్‌మెన్ విశాగ‌ణ్‌తో సౌంద‌ర్య ఏడ‌డుగులు వేయ‌గా, వారి వివాహానికి ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. పెళ్లి త‌ర్వాత చెట్టాప‌ట్టాలు వేస్తున్న ఈ జంట రీసెంట్‌గా చెన్నై నుండి లండ‌న్ వెళ్ళేందుకు టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో లండ‌న్‌లోని హెర్బ్యూ ఎయిర్ పోర్ట్‌కి చేరుకోగా, ఇమ్మిగ్రేష‌న్ స‌మ‌యంలో విశాగ‌ణ్ త‌న పాస్ పోర్ట్‌తో పాటు అమెరిక‌న్ డాల‌ర్స్‌తో కూడిన సూట్‌కేసు మిస్ అయినట్టు తెలుసుకున్నాడు. 
 
ఆపై ఆయన వెంటనే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే భారత రాయబార కార్యాలయం కూడా వెంట‌నే స్పందించి విశాగన్ కోసం డూప్లికేట్ పాస్ పోర్ట్ జారీ చేసిన‌ట్టు స‌మాచారం. సౌంద‌ర్య‌, విశాగ‌ణ్‌ల‌కి ఇదివ‌రికే వివాహం కాగా, వారిరివురు ఇటీవ‌ల రెండో పెళ్లి చేసుకున్నారు. 
 
కాగా, సౌంద‌ర్య 2010లో వ్యాపార‌వేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను సౌంద‌ర్య పెళ్లి చేసుకున్న‌ది. ఆ త‌ర్వాత వాళ్లు 2016లో విడాకులు తీసుకున్నారు. సౌంద‌ర్య‌కు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కొచ్చియాడ‌న్‌, వీఐపీ 2 చిత్రాల‌కు ఆమె డైర‌క్ట‌ర్‌గా ప‌ని చేశారు.