శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (09:33 IST)

రజినీకాంత్ స్థానికేతరుడు.. తమిళనాడును తమిళుడే పాలించాలి : సీమాన్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు స్థానికేతర సెగ తగిలింది. ఆయన ప్రారంభించనున్న రాజకీయ పార్టీని అడ్డుకుని తీరుతామని తమిళ దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ ప్రకటించారు. పైగా, తమిళనాడు రాష్ట్రాన్ని కేవలం తమిళుడే పరిపాలించాలని ఆయన స్పష్టం చేశారు. 
 
కాంచీపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలను దూరం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తాము ఓడిపోలేదనీ, ప్రజలే ఓడిపోయారన్నారు. తాను చదువుకోకపోయినా ఇతరుల చదువు కోసం శ్రమించిన కామరాజర్ వంటి నాయకులు ఇప్పుడు లేరని సీమాన్ అన్నారు.
 
ఇకపోతే, తమిళనాడును తమిళుడే పాలించాలని, రాష్ట్రేతరులు పాలించడాన్ని తాము అడ్డుకుంటామని నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త సీమాన్‌ హెచ్చరించారు. రజనీకాంత్ కనుక రాజకీయ పార్టీని ప్రకటిస్తే దానిని అడ్డుకుని తీరుతామని ఆయన ప్రకటించారు.