సంబంధిత వార్తలు
- అమృత తండ్రి మామూలోడు కాదు.. ఐసిస్ ఉగ్రవాదితో లింకులు...
- అర్జున్ రెడ్డితో పూరీ జగన్నాథ్ సినిమా? వర్కౌట్ అవుతుందా?
- అబ్బా.. ఏం చూపించిందిరా పాయల్.. ఆర్ఎక్స్-100 హీరోయిన్పై ప్రశంసలు
- మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్.. శ్రీరెడ్డి కామెంట్స్
- అలాంటి ఫోటోలకు వర్మ తల అంటించాడు.. అంతే పోలీసులు అరెస్ట్ చేశారు..
పరువు కోసం మారుతీరావే చావాలి... రాంగోపాల్ వర్మ
రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య. ఆర్యవైశ్యవర్గానికి చెందిన అమ్మాయిని ఓ దళిత యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక
రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య. ఆర్యవైశ్యవర్గానికి చెందిన అమ్మాయిని ఓ దళిత యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన అమ్మాయి తండ్రి.. తన అల్లుడుని కిరాయి మనుషులకు రూ.కోటి సుపారీ ఇచ్చి హత్య చేయించాడు.
దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. తన పరువు కోసం ప్రణయ్ను చంపడం వల్ల అమృతవర్షిణి తండ్రి మారుతీరావుకి ఒరిగిందేమీ లేదని, ఒకవేళ పరువు కోసమే ఈ హత్య చేయిస్తే అతడు చావడమే మేలని వ్యాఖ్యానించారు.
పరువు కోసం ఎవరినైతే చంపిస్తారో, అలాంటివారిని చంపినపుడే నిజమైన పరువు హత్య అని రాంగోపాల్ వర్మ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అమృత తండ్రి కేవలం పిరికితనంతో కూడిన ఓ చెత్త నేరస్థుడని ఆయన వ్యాఖ్యానించారు.
తర్వాతి కథనం
