అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!
తిరువణ్ణామలై అరుణాచలక్షేత్ర ప్రదర్శనకు వెళ్లిన సినీ నటి స్నేహ, ఆమె భర్త ప్రసన్న చేసిన పనికి భక్తులు మండిపడుతున్నారు. దీంతో ఆమె వివాదంలోకి చిక్కుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, స్నేహ, ఆమె భర్త ప్రసన్న కుమార్ అరుణాచలం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇద్దరూ కలిసి గిరిప్రదక్షిణ చేశారు. ఆలయాల వద్ద కొబ్బరికాయలు కొడుతూ కాలినడకన గిరిప్రదక్షిణ చేశారు. అయితే, గిరిప్రదక్షిణ చేసేటపుడు వీరిద్దరూ కాళ్లకు చెప్పులు ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
దీంతో స్నేహ, ప్రసన్నలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పులు వేసుకుని గిరిప్రదక్షిణ చేయడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపచారం చేశారని, ఇది మహాపాపమని వ్యాఖ్యానిస్తున్నారు. తెలియక చేసుంటారని, స్నేహ దంపతులకు కొందరు అండగా నిలుస్తున్నారు.
మన దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. అరుణాచలం దర్శనానికి ముందు జీవితం వేరు, దర్శనం తర్వాత దర్శనం వేరు అని భక్తులు భావిస్తుంటారు. గిరిప్రదక్షిణ చేసి శివుడుని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందనేది భక్తుల నమ్మకం. ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు అరుణాచలంకు చేరుకుని స్వామివారిని సందర్శిస్తుంటారు.