శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:34 IST)

ప్రకంపనలు రేపుతున్న సుశాంత్ ఆత్మహత్య - రియా చక్రవర్తి బ్రదర్ అరెస్టు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఇపుడు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు సీబీఐకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. కూపీలాగగా బాలీవుడ్‌లోని డ్రగ్ మాఫియా మూలాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా, సుశాంత్ ప్రియురాలు నటి రియా చక్రవర్తికి మాదకద్రవ్య వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేసు నమోదు చేసింది. 
 
ఈ క్రమంలో రియా చక్రవర్తి సోదరుడు శౌవిక్ చక్రవర్తిని అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో శామ్యూల్ మిరాండాను కూడా ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రియాను, ఆమె తండ్రిని కూడా సీబీఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, ఎన్‌సీబీ అధికారులు కూడా ప్రశ్నించారు.  
 
జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసులో ఆయన గాళ్‌ఫ్రెండ్ పాత్రపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడో రేపో రియాను కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.
 
ఇదిలావుండగా, సుశాంత్ ఆత్మహత్య కేసు ఇపుడు అనేక మలుపులు తిరిగి చివరకు డ్రగ్స్ దందావైపు టర్న్ తీసుకుంది. డ్రగ్స్‌ కోణం బయట పడిన తర్వాతే ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలయ్యింది. తొలుత ముంబై పోలీసులతో మొదలైన ఈ కేసు విచారణలో.. సీబీఐ, ఈ, ఎన్‌సీబీ కూడా ఎంటరయ్యింది. వీటి వెనుక అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.