గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (09:51 IST)

#ModixijinpingMeet మహాబలిపురాన్ని ఇందుకే ఎంపిక చేశారట....

భారత్‌లోని సర్వాంగసుందరంగా ఉండే సముద్రతీర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిలో మహాబలిపురం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర రాజధాని చెన్నైకు సమీపంలో ఉంది. అయితే, ఇలాంటి పర్యాటక ప్రాంతాలు, నగరాలు భారత్‌లో ఎన్నో ఉన్నాయి. కానీ, భారత్ - చైనా దేశాధినేతల భేటీకి మహాబలపురాన్ని మాత్రమే ఎంపిక చేశారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
దాదాపు 1200 సంవత్సరాల క్రితం... అంటే 7, 8 శతాబ్దాల సమయంలో మహాబలిపురాన్ని పల్లవ రాజులు ఎంతో అద్భుతంగా పాలించారు. తీర్చిదిద్దారు దీన్ని ఓ మహానగరంగా మార్చారు. ఈ నగరానికి, చైనాకు ఓ చారిత్రక అనుబంధం ఉంది. మూడో పల్లవరాజు కుమార విష్ణువు ఎన్నో యుద్ధ విద్యల్లో, వైద్య కళల్లో నిష్ణాతుడు. ఆయన బౌద్ధమతం స్వీకరించి, ఓ పని నిమిత్తం చైనాకు వెళ్లిపోయి అక్కడే ఉండిపోతాడు. చైనాలో ఆయన బోధి ధర్ముడుగా మారిపోయారు. 
 
చైనాలో బోధి ధర్ముడు ఎంతో ఆరాధ్యుడు. అక్కడి ప్రజలు నిత్యమూ ఆయన్ను పూజిస్తుంటారు. ఈ కారణం చేతనే తమకు ఆరాధ్యుడైన కుమార విష్ణువు నడయాడిన ప్రాంతాన్ని తిలకించాలని భావించిన జిన్ పింగ్, మహాబలిపురాన్ని ఎంచుకున్నారు. కాగా, బోధి ధర్ముడి కథపై ఆ మధ్య సూర్య, శ్రుతి హాసన్ జంటగా ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.