1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Black Fungus Case registerd in Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు

Uttar Pradesh
దేశంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. ముఖ్యంగా, కరోనా వైరస్ థర్డ్ వేవ్ మరింతగా విజృంభిస్తుంది. అలాగే, ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా బ్లాక్ ఫంగస్ కేసు ఒకటి నమోదైంది. ఇది ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్లో నొప్పిగా ఉందని ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లగా, అతనికి వైద్యులు నిర్వహించిన వివిధ పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్థారించారు. ఇది బ్లాక్ ఫంగస్ అని వైద్యులు తేల్చారు. అంతేకాకుండా, ఆ వ్యక్తి షుగర్ కారణంగా బ్లాంగ్ ఫంగస్ బారినపడినట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సదరు వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కారుణ్య ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా ఊపిన సీఎం జగన్