Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకా తీసుకున్న వారంతా రెండేళ్లలో చనిపోతారా?

Written By ఐవీఆర్
Updated: బుధవారం, 26 మే 2021 (10:07 IST)
ప్రపంచం మహమ్మారి కరోనావైరస్‌తో పోరాడుతున్న నేపధ్యంలో ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో చాలా తప్పుడు సందేశాలు షేర్ అవుతున్నాయి. అందులో ఒక దారుణమైన సందేశం నిన్నటి నుంచి చక్కెర్లు కొడుతోంది.
 
అదేమిటంటే... వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు రెండేళ్లలో చనిపోతారని ఒక చిత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే, ఈ వాదన పూర్తిగా నకిలీదని, టీకా పూర్తిగా సురక్షితం అని పిఐబి ఫాక్ట్ చెక్ ధృవీకరించింది.
 
 
సోమవారం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ 21.80 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను రాష్ట్రాలకు అందించింది. 1.80 కోట్ల మోతాదులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఉచితంగా 21.80 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను అందించింది.

అన్నీ చూడండి

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

అమీర్ లోగ్ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది : సాయి మార్తాండ్

తర్వాతి కథనం
Show comments