సంబంధిత వార్తలు
- ఓట్ల కౌంటింగ్కు వెళ్లాలంటే కోవిడ్ నెగెటివ్ రిపోర్టు మస్ట్ : ఈసీ
- ఆసీస్ క్రికెటర్ దాతృత్వం.. పీఎం కేర్కు విరాళం... భారత క్రికెటర్లకు ఏమైంది?
- ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాల్సి వుంటుంది : హైకోర్టు
- భక్తుల లేని తిరుమల కొండ ... రూ.కోటి కిందకు పడిపోయిన ఆదాయం
- కరోనా ఎఫెక్ట్.. పూరీ జగన్నాథ ఆలయం మూసివేత.. మే 15 వరకు..?
తెరాసకి ఓటు వేస్తే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా, ఎవరు?
కోవిడ్ విజృంభిస్తున్నప్పటికీ ఎన్నికల కోలాహలం మాత్రం మామూలుగా వుండటంలేదు. మరో రెండు రోజుల్లో తెలంగాణలోని పరిధిలో ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేసి హోరెత్తించారు. మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగియగా ఇప్పుడు కొత్త తరహాలో వరంగల్ జిల్లాలో ఓ ఫ్లెక్సీ దర్శనమిస్తోంది.
అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓ అభ్యర్థి ఫ్లెక్సీ పెట్టాడు. ఆ ఫ్లెక్సీలో చేతితో చెప్పును పట్టుకుని, తెరాసకి ఓటు వేస్తే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా అంటూ టాగ్ లైన్ పెట్టాడు. ఈ ఫ్లెక్సీని చూసిన జనం అవాక్కవుతున్నారు.
