1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (16:32 IST)

నిత్యానంద స్వామి దీవి గురించి ట్విట్టర్‌లో కైలాస సిస్టర్స్ ఏమన్నారు? (video)

Kailasha Sisters
Kailasha Sisters
వివాదాస్పద బాబా నిత్యానంద స్వామి కైలాస దీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కైలాస దీవికి తగిన గుర్తింపు కోసం ఆ దీవికి సంబంధించిన ప్రతినిధులు యూఎన్‌లో ప్రసంగించిన సంగతి తెలిసిందే. తాజాగా కైలాస దీవి ప్రతినిధులు, నిత్యానంద స్వామీజీ అనుచరులు ఓ వీడియో రూపంలో మీడియా ముందుకు వచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తమ కైలాస దీవికి సంబంధిన వివరాలను తెలియజేశారు. 
 
మానవతా సేవలు, ప్రపంచ శాంతి కోసం కైలాస సిస్టర్స్ సిటీ సంబంధాలను ఏర్పాటు చేసింది. కైలాసం అనేది పురాతన జ్ఞానోదయమైన హిందూ నాగరికత దేశపు పునరుజ్జీవనం అంటూ కైలాస దీవికి చెందిన నిత్యానంద స్వామి శిష్యులు ట్విట్టర్‌లో వీడియో ద్వారా తెలిపారు. 
 
కైలాసకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు, మా మానవతా సేవలను కొనసాగించడానికి, విభిన్న సంస్కృతులపై మంచి అవగాహన ద్వారా ప్రపంచ శాంతిని పెంపొందించడానికి నెవార్క్‌తో సహా ప్రపంచంలోని అనేక నగరాలతో సోదరి నగర సంబంధాలను ఏర్పరచుకున్నాయని వివాదాస్పద స్వామి నిత్యానంద శిష్యులు చెప్పారు 
 
ఇటీవల జరిగిన యూఎన్ కార్యక్రమంలో, కైలాసానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక సంస్థలు హింసకు గురైన హిందువుల కోసం వాదించాయి. కైలాస దీవి, దాని ప్రతినిధులు ఎవరినీ మోసం చేయలేదని వారు స్పష్టం చేశారు. అంతేగాకుండా తాము నకిలీ కాదని స్పష్టం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
 
జగద్గురు మహాసన్నిధానం (SPH) భగవాన్ నిత్యానంద పరమశివం హిందూ మతపరమైన ఆచారాల ప్రకారం అతని పూర్వీకులచే అధికారికంగా శిక్షణ పొంది, ఎన్నుకోబడ్డారని గమనించడం ముఖ్యం. అతను స్వయంగా చెప్పుకునే దేవత కాదు. 
 
ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని తాము మీడియా సంస్థలను కోరుతున్నట్లు తెలిపారు. కైలాసదీవిపై ఏవైనా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు కైలాస దీవి ప్రతినిధులు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. 
 
కైలాసదీవిపై ఏవైనా ప్రశ్నలకు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు. ప్రపంచ శాంతి మరియు ఐక్యతను పెంపొందించగలమని తాము ఆశిస్తున్నామని వెల్లడించారు.