డాబా మీద తల్లి.. ఇద్దరు పిల్లలు.. గోడమీద నుంచి తొంగి చూసిన చిరుత.. ఆ తర్వాత? (video)
ఇద్దరు పిల్లలు.. ఓ తల్లి డాబా మీద హాయిగా కూర్చున్నారు. పిల్లలు ఇద్దరూ ఆడుకుంటూ వుండగా.. తల్లి ఏవో బూరెలు చేస్తూ కనిపించింది. ఇంతలో డాబా గోడ మీద చిరుతపులి కనిపించింది. అంతే ఆ తల్లి షాకైంది. పిల్లాడు మెల్లగా ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోయాడు.
చిన్నారి ఆ తల్లి భయంతో వణుకుతూ దగ్గరికి తీసుకుంది. అయితే ఇంతలో ఎక్కడ నుంచో వచ్చిన కుక్క పులిని తరిమి కొట్టింది. బాలుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పులిని శునకం పోరాడి గోడపై నుంచి కిందపడేలా చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా మీమ్స్, కామెంట్స్ అంటూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.