చంద్రబాబు దూకుడు... లోక్సభ అభ్యర్థుల పేర్లు వెల్లడి...  
                                       
                  
                  				  సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీతోనూ పొత్తులేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్న టీడీపీ.. ఈ దఫా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 
				  											
																													
									  
	 
	తాజాగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ పార్టీ ప్రభుత్వ పనితీరుపై రిపోర్ట్ తెప్పించుకంటూ, ఐవీఆర్ ద్వారా స్థానిక ప్రజలు ఫీడ్బ్యాక్లు తీసుకుని అభ్యర్థులను చంద్రబాబు ఎంపిక చేస్తున్నారు. ఇందులోభాగంగా, గురువారం తొలి జాబితాను వెల్లడించారు. ఇందులో 8 మంది లోక్సభ అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటించారు. ఆ వివరాలను పరిశీలిస్తే,
				  
	 
	లోక్ సభ సభ్యలు
	1. శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు
	2. విజయనగరం- అశోక్ గజపతిరాజు
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	3. అమలాపురం- హరీష్.. లోక్సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడు.
	4. విజయవాడ- కేశినేని నాని
				  																		
											
									  
	5. కడప- ఆదినారాయణ రెడ్డి
	6. గుంటూరు- గల్లా జయదేవ్
	7. నంద్యాల-ఎస్పీ వై రెడ్డి కుటుంబ సభ్యులు
				  																	
									  
	8. బాపట్ల- శ్రీరామ్ మాల్యాద్రి