1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By pnr
Last Updated : సోమవారం, 27 మార్చి 2017 (12:54 IST)

డయాబెటిక్ రోగులకు ఆయుర్వేద అమరసంజీవని నేరేడు

వేసవికాలంలో లభించే పండ్లలో నేరేడు పండ్లు. మామిడి, పుచ్చకాయలతో పాటు నేరేడు పండ్లు కూడా విరివిగా లభిస్తాయి. ఈ పండు ఆయుర్వేదంలో అమరసంజీవనిగా పిలుస్తారు. ఈ పండు చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది

వేసవికాలంలో లభించే పండ్లలో నేరేడు పండ్లు. మామిడి, పుచ్చకాయలతో పాటు నేరేడు పండ్లు కూడా విరివిగా లభిస్తాయి. ఈ పండు ఆయుర్వేదంలో అమరసంజీవనిగా పిలుస్తారు. ఈ పండు చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.
 
సాధారణంగా వేసవిలో లభించే మామిడి, పుచ్చకాయలను డయాబెటిక్ రోగులు ఆరగించలేరు. ఎందుకంటే ఈ పండ్లను ఆరగించడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ నేరేడు పండ్లను ఆరగించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
 
ఇందులో ఆమ్లాలు, ఆక్సలిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం ఉండటంతో ఈ పండుకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ పండ్లను ఉప్పు, చక్కెర, కారం కలుపుని తింటుంటారు. నేరేడును నీటితో శుభ్రంగా కడిగి తినాలి.
 
అంతేకాకుండా, ఆకులు, గింజలు ఆరోగ్యానికి రక్షణ కల్పించేవి. ఈ పండు కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉంటుంది. చూడటానికి వంకాయరంగులో మిలమిలా మెరిసి పోతు ఉంటుంది.