పెసరపిండిలో కొద్దిగా ఆపిల్ గుజ్జు కలిపి..?

మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:31 IST)
నిత్యం అందుబాటులో ఉండే పెసరపిండితో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పెసరపప్పులోని గుణాలు చర్మ ఛాయను పెంచేందుకు ఎంతో దోహదపడుతాయి. కొద్దిగా పెసరపిండిలో చిటికెడు పసుపు, పాలు వేసి బాగా కలుపుకోవాలి. 
 
ఇప్పుడు ముఖానికి ఆలివ్ నూనె లేదా నువ్వుల నూనె రాసి 2 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పెసర పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్‌ను పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం మెరిసిపోతుంది. 
 
3 స్పూన్స పెసరిపిండిలో 2 స్పూన్ల పెరుగు, కీరదోస రసం, కొన్ని చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. అలానే 3 స్పూన్ల పెసరపిండిలో కొద్దిగా ఆపిల్ గుజ్జు, స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి.
 
ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేసుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ ఉదయాన్నే చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.  

అన్నీ చూడండి

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

రైతులకు శుభవార్త - త్వరలో కేరళను తాకనున్న రుతుపవనాలు

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments