పెసరపిండిలో కొద్దిగా ఆపిల్ గుజ్జు కలిపి..?

మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:31 IST)
నిత్యం అందుబాటులో ఉండే పెసరపిండితో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పెసరపప్పులోని గుణాలు చర్మ ఛాయను పెంచేందుకు ఎంతో దోహదపడుతాయి. కొద్దిగా పెసరపిండిలో చిటికెడు పసుపు, పాలు వేసి బాగా కలుపుకోవాలి. 
 
ఇప్పుడు ముఖానికి ఆలివ్ నూనె లేదా నువ్వుల నూనె రాసి 2 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పెసర పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్‌ను పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం మెరిసిపోతుంది. 
 
3 స్పూన్స పెసరిపిండిలో 2 స్పూన్ల పెరుగు, కీరదోస రసం, కొన్ని చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. అలానే 3 స్పూన్ల పెసరపిండిలో కొద్దిగా ఆపిల్ గుజ్జు, స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి.
 
ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేసుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ ఉదయాన్నే చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.  

అన్నీ చూడండి

భర్త ICUలో వుంటే వెకిలిగా నవ్వుతూ రీల్స్ చేసిన భార్య, వీడియో వైరల్

ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

అన్నీ చూడండి

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

Thalapathy: ముగిసిన దళపతి విజయ్ జ‌న నాయ‌గ‌న్‌ నిరీక్ష‌ణ‌.. జూలై 23న గ్రాండ్ రిలీజ్

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

తర్వాతి కథనం
Show comments