బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. రాత్రివేళ బాదంపప్పులను నానబెట్టుకుని ఉదయాన్నే పొట్టుతీసి మెత్తగా రుబ్బకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుకుని మ

Written By Kowsalya
Updated: మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:42 IST)
చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. రాత్రివేళ బాదంపప్పులను నానబెట్టుకుని ఉదయాన్నే పొట్టుతీసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
ఇలా 15 రోజుల పాటు చేస్తే పాలలోని గుణాలు మురికిని తొలగించి చర్మాన్ని కాంతివంతగా మారుస్తాయి. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా పాల మీగడ, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారి మెుటిమలు తొలగిపోతాయి. 
 
రోజ్ వాటర్‌లో కొద్దిగా గ్లిజరిన్, నిమ్మరసం కలుపుకుని మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడపై గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. తద్వారా మెడ భాగం అందంగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే కూడా చర్మంపై గల ముడతలు పోతాయి. 
About Author
Kowsalya

అన్నీ చూడండి

ప్రసూతి సెలవుల తర్వాత విధులకు న్యూస్ రీడర్.. ఆ బాబుకు మధురమైన క్షణం.. ఎలా? (video)

రాజ్యమా ఉలికిపడు... ప్రధాని మోడీకి కేటీఆర్ హెచ్చరిక

పుట్టినరోజే మరణించాడు.. ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఆందోళన చేస్తాం : సీజీపీ

రెండోసారి కూడా ఆడబిడ్డ.. నీటి సంపులో పడేసి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ప్రభాస్ స్పిరిట్‌లో కత్రినా కైఫ్.. దీపికా అలా చేయడంతో?

జన నాయగన్ చిత్రం నుంచి నా సన్నివేశాన్ని తీసేసారు: గద్గద స్వరంతో నటి ఆనంది

Vijayashanti :చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ వుంది :విజయశాంతి

Sakshi Madolkar : శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

Kalyanram: తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్నవెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం

తర్వాతి కథనం
Show comments