1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. beauty tips with onion and curd

ఉల్లిపాయ మిశ్రమాన్ని కాలిన మచ్చలపై రాసుకుంటే?

చర్మంపై గల నల్ల మచ్చలు తొలగిపోయేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రివేళ కొద్దిగా మెంతుల్ని నానబెట్టుకుని ఉదయాన్ని వాటిని పేస్ట్‌లా చేసుకుని మచ్చలపై రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటి

onion
చర్మంపై గల నల్ల మచ్చలు తొలగిపోయేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రివేళ కొద్దిగా మెంతుల్ని నానబెట్టుకుని ఉదయాన్ని వాటిని పేస్ట్‌లా చేసుకుని మచ్చలపై రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వలన కాలిన మచ్చలు తొలగిపోతాయి.
 
పెరుగులో కొద్దిగా పసుపు, నిమ్మరసం బార్లీ పొడి కలుపుకుని మచ్చలపై రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కూడా నల్లటి మచ్చలు పోతాయి. ఉల్లిపాయలను చిన్నముక్కలుగా కోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోటరాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. 
 
గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా తేనెను కలుపుకుని మచ్చలపై రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే నల్లగా మారిన చర్మం కాస్త సాధారణ స్థితికి మారుతుంది. రోట్ వాటర్‌లో కొద్దిగా తేనె, పసుపు కలుపుకుని మచ్చలపై రాసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే మచ్చలు తొలగిపోతాయి. క్యారెట్ మిశ్రమాన్ని మచ్చలపై రాసుకుంటే కూడా నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
టామోటా గుజ్జును ముఖానికి రాసుకుంటే?