పుదీనా ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:39 IST)
నేటి తరుణంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ అందం, చర్మ సౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి కావలసిన విధంగా చర్మం అందాన్ని రెట్టింపు చేయాలంటే.. పుదీనా ఆకులు తీసుకుంటే చాలు. పుదీనా ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి.
 
పావుకప్పు పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా తేనె, పెరుగు, నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మీ చర్మం మృదుత్వాన్ని సొంతం చేసుకుంటుంది.
 
పుదీనా ఆకులను కాస్త చిన్న మంట వేయించి వాటిని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌లో గుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి.. గంట తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు ఇలా చేస్తే నల్లగా ఉన్న చర్మం తెల్లగా మారుతుంది.
 
జామ ఆకులను బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిలో పెరుగు, స్పూన్ మోతాదులో రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే పొడిబారిన చర్మం తాజాగా మారుతుంది.   

అన్నీ చూడండి

పరీక్ష పేపర్ ఇస్తాను.. కోరిక తీర్చు : విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు

బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన తాతయ్య, వీడియో

బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తమిళనాడులో విస్తారంగా వర్షాలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

అన్నీ చూడండి

Ramcharan: పెద్ది ప్రమోషన్ కు ముందు రామ్ చారణ్ కుడిచేతి బ్యాండేజ్ పై అభిమానులు ఆసక్తి

Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ

Pavala Shyamala: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పావలా శ్యామల..

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

తర్వాతి కథనం
Show comments