Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోయాబీన్‌ను పచ్చిపాలలో కలిపి మూఖానికి పట్టిస్తే?

పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలుచేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా తయారుచేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలుగా వేసుకోవ

Written By Kowsalya
Updated: మంగళవారం, 12 జూన్ 2018 (21:18 IST)
పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలుచేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా తయారుచేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలుగా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్న కడుక్కుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
 
సోయాబీన్‌ను మెత్తగా రుబ్బుకుని అందులో పచ్చిపాలను కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలాచేయడం వలన ముఖం మృదువుగా తయారవుతుంది. నిమ్మరసంలో తులసి ఆకుల రసాన్ని కలిపి రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత కడుక్కుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
శెనగపిండిలో నెయ్యి, పసుపు కలుపుకుని పేస్టులా తయారుచేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత మసాజ్ చేసుకుంటే పొడిబారిన చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది. ప్రతిరోజూ చర్మానికి తేనె పూతగా రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు, తేనె, మీగడతో పాటు గులాబీ రసం కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి.
 
ఆ పేస్టును ముఖానికి పూతలుగా వేసుకుని పావుగంట తరువాత కడిగేస్తే మచ్చలు, కాలిన గాయాలు, మెుటిమలు తొలగిపోతాయి. కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఇలాచేయడం వలన చర్మం తాజాగా ఉంటుంది.
About Author
Kowsalya

అన్నీ చూడండి

బంగారం, సెల్ ఫోన్లు కొట్టేసి బెడ్రూంలోనే హాయిగా నిద్రపోయిన దొంగ, ఎక్కడ?

ఆడపులి దాడి చేసింది.. నా గేదెలు నన్ను కాపాడాయి.. అవి లేకుంటే ప్రాణాలతో...?

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభం.. ఎగతాళి చేసినవారంతా తలదించుకోవాలి.. చంద్రబాబు (video)

ప్రధాని మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ... ఇంతకీ ఎవరీమె?

ఆస్పత్రి వాష్‌రూమ్‌లో విగతజీవిగా నర్సు... ఎక్కడ?

అన్నీ చూడండి

రజనీకాంత్, కమల్ హాసన్ ధర్మన్ రెండవ షెడ్యూల్ ప్రారంభం

హుషార్ పిట్టలు కంటెంట్ అందరికీ కనెక్ట్ అవుతుంది :వెంకట్‌ యాదవ్‌

Nag: కన్స్యూ మర్ యాప్ ను ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అక్కి నేని నాగార్జున

Kamakshi Bhaskarla: వద్దు అని నా ముందే అన్నారు,అదే చేదు అనుభవం : కామాక్షి భాస్కర్ల

రెండేళ్ల పాటు అలాంటి సంబంధంలో గడిపాను.. అపరిచితుడులా మారేవాడు.. అనుపమ

తర్వాతి కథనం
Show comments