1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (13:01 IST)

స్వల్పంగా పెరిగిన డీజల్ ధర - స్థిరంగా పెట్రోల్

దేశంలో పెట్రోల్, డీజల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటే, డీజల్ ధర స్వల్పంగా పెరిగింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరలు స్థిరంగా ఉన్నా డీజిల్‌ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.  
 
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర స్థిరంగా రూ.105.27 ఉండగా డీజిల్​ ధర 26 పైసలు పెరిగి రూ.97.17కు చేరింది. 
 
అలాగే, ముంబైలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.107.27 ఉండగా లీటర్​ డీజిల్​ ధర 25 పైసలు పెరిగి రూ.96.65కి చేరింది. కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.101.64గా ఉండగా  డీజిల్​ 23 పైసలు పెరిగి రూ.92.14కు చేరింది. చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.98.97 ఉండగా లీటర్​ డీజిల్​ 22 పైసలు పెరిగి రూ.93.45కు చేరింది.